రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: విద్యుత్‌ హైటెన్షన్‌ వైరు ముగ్గురి ప్రాణాలు బలిగొంది. కీసర గ్రామానికి చెందిన శెట్టి మల్లేష్‌ కుటుంబం శివాజీనగర్‌ లో నివసిస్తోంది. వారికి రెండు ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని ఇంటిముందు ఉంచుతారు. వాటితో పాటు వారి ఇండికా కారును కూడా ఇంటిముందు ఉంచారు.

గత అర్థరాత్రి అవి తగులబడుతుండటం గమనించి మల్లేష్‌, అతని తమ్ముదు లక్ష్మణ్‌, తల్లి మంటలు ఆపే ప్రయత్నం చేశారు. ఆ మంటలు హైటెన్షన్‌ వైరు తెగిపడి వచ్చాయి. ఆ విషయం తెలియక వారు ఆర్పే యత్నం చేయగా కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మరణించారు. మల్లేష్‌ భార్యకూడా గాయపడింది.

రంగారెడ్డి జిల్లా కీసరగుట్టలో హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తెగిపడి ముగ్గురు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏఈ, డీఈలపై సస్పెన్షన్‌ వేటు వేయగా, ఎస్‌ ఈని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.9లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X