వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అఫ్గాన్ పేలుడులో 14 మంది మృతి
కాబూల్: మధ్య అఫ్గానిస్తాన్ లో గురువారం సంభవించిన పేలుడులో 14 మంది మరణించినట్లు లోగార్ ప్రొవిన్షియల్ చీఫ్ ముస్తాఫా ఖాన్ చెప్పారు. ఈ సంఘటన లోగార్ ప్రొవిన్షియల్ లో గురువారం ఉదయం జరిగిందని ఆయన అన్నారు. మృతుల్లో పది మంది పౌరులు, నలుగురు పోలీసులు ఉన్నట్లు తెలిపారు.
అమెరికా సైనిక దాడులు జరుగుతున్న వందల కిలోమీటర్ల దూరంలో ఈ పేలుళ్లు సంభవించాయి. హెల్మాండ్ ప్రొవిన్స్ లో అమెరికా సైనిక దాడులు జరుగుతున్నాయి. ఈ రెండు సంఘటనలకు మధ్య సంబంధం లేదు.
Comments
Story first published: Thursday, July 9, 2009, 11:52 [IST]