వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమర్ నాథ్ సమీపంలో కూలిన హెలికాప్టర్
న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రలో అపశృతి దొర్లింది. అమర్ నాథ్ కు యాత్రికులను చేరవేసే ఓ హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురు యాత్రికులు మృతిచెందినట్లు భావిస్తున్నారు. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్ శకలాల కోసం గాలింపు చేపట్టారు. కూలిన విమానం హిమాలయన్ ఏవియేషన్ కంపెనీకి చెందింది. ఇది బల్తాల్, సోనమార్గ్ ల మధ్య ప్రయాణికులను చేరవేస్తుంది. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Comments
Story first published: Thursday, July 9, 2009, 9:07 [IST]