వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెజవాడలో బిటెక్ విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ: విజయవాడలో గురువారం ఒక బిటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను విజయవాడలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శివప్రసాద్ అనే ఆ విద్యార్థి కడపకు చెందినవాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు.
సెలవులకు స్వస్థలం వెళ్లిన శివప్రసాద్ ఈ నెల 5వ తేదీన తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం మహానాడు రోడ్డులోని హాస్టల్లో టిఫిన్ చూసి తన గదికి వెళ్లాడు. ఆ తర్వాత ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తలుపు తీసి చూస్తే ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప నుంచి బంధువులు వస్తే ఆత్మహత్యకు కారణాలు తెలియవచ్చునని పోలీసులు అంటున్నారు.
Story first published: Thursday, July 9, 2009, 16:14 [IST]