నా బాధలన్నీ బాబుకు చెప్పా: తలసాని

నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ పార్టీ నేతల సమావేశానికి సమాచారం లేకపోవడం వల్ల హాజరు కాలేదని, ఈ రోజు సమాచారం ఉంది కాబట్టి వచ్చానని ఆయన చెప్పారు. తెలంగాణవాదానికి బలం ఉందా లేదా అనే విషయంపై తాను గ్రేటర్ హైదరాబాదులో చేయిస్తున్న సర్వేను నిలిపేశానని, చంద్రబాబే ఆ సర్వే చేయిస్తానని చెప్పారని, దాని వల్ల తాను ఆపేశానని ఆయన చెప్పారు. చంద్రబాబుతో అన్ని విషయాలు చెప్పానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తన బాధలన్నీ చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. దీన్ని బట్టి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీకి వచ్చినట్లే కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications