హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెరాసపై రాములమ్మ మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: పార్టీ వ్యవహార శైలిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ వ్యవహారాలపై ఆమె ఎట్టకేలకు శనివారం పెదవి విప్పారు. తనను పార్టీయే దూరంగా పెడుతోందని, తాను దూరం కావాలని దూరం కావడం లేదని ఆమె అన్నారు. పార్టీ నేతలు తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను చిన్నచూపు చూస్తున్నారని ఆమె అన్నారు.

పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరుతున్న సమయంలో హైదరాబాదులో అత్యవసర సమావేశాలున్నాయని, తప్పకుండా రావాలని కబురు పంపారని, తీరా అక్కకు వెళ్లాక తనను ఎవరూ సంప్రదించలేదని ఆమె అన్నారు. హడావిడిగా పిలిపించి ఒక్కరు కూడా తనతో మాట్లాడలేదని ఆమె అన్నారు. తనను పార్టీ నుంచి పంపించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.

కాగా, విజయశాంతి ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. దాంతో ఆమె కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు వదంతులు వ్యాపించాయి. ఆ వార్తలను విజయశాంతి ఖండించనూ లేదు, సమర్థించనూ లేదు. శనివారం ఆమెతో తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X