రైతు సహకారానికే: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకే తాము సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన సభలో ఆయన శనివారం ప్రసంగించారు. సహకార వ్యవసాయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు. సహకార సేద్యం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

వ్యవసాయం వ్యవసాయం మాదిరిగా కాకుండా వ్యాపారంలా చేయాలని, అప్పుడే రైతులకు లాభాలు వస్తాయని, సహకార వ్యవసాయం అందుకు తోడ్పడుతుందని ఆయన అన్నారు. సహకార వ్యవసాయం వల్ల రెట్టింపు ఆదాయం సమకూరుతుందని ఆయన చెప్పారు. ప్రాణహిత - చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయే వారికి తగిన న్యాయం చేస్తామని, వారికి ఎక్కువ ధర చెల్లిస్తామని, అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+