సారథి స్టూడియోస్ డైరెక్టర్ హత్య
రాత్రి 9 గంటలకు వాకింగ్ కు వెళ్లిన బాబూరావు 11 గంటలు దాటినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు సారథి స్టూడియోస్ వెతికారు. స్టూడియోలో రక్తం మడుగులో పడి ఉన్న బాబూరావును ఆయన కుమారుడు శరత్ చూసి ఇమేజ్ అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాబూరావు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు దాంతో పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
అర్థరాత్రి వరకు స్టూడియో షూటింగులతో రద్దీ ఉంటుంది. అటువంటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు లోనికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కత్తులతో దాడి చేసి పారిపోతుంటే సిబ్బంది చూసే అవకాశం ఉందని, అందువల్ల బాగా తెలిసినవారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు.
Comments
Story first published: Friday, September 25, 2009, 10:47 [IST]