చర్చలకు సిద్ధమే: మావోల బాస్

Maoists
కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో షరతులతో కూడిన చర్చలకు మావోయిస్టుల అగ్రనేత కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జీ అంగీకరించారు. ఇన్ స్పెక్టర్ ఇందూవర్ తల నరికింది తామేనని ఆయన అంగీకరించారు. అయితే అందుకు ఆయన ఏ మాత్రం విచారం వ్యక్తం చేయలేదు. తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమేనని, అయితే తొలుత ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని ఆయన అన్నారు. ఒక రహస్య ప్రదేశంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని, జూన్ లో జాయింట్ ఆపరేషన్ మొదలైనప్పటి నుంచి అరెస్టు చేసిన తమవారిని వదిలేయాలని ఆయన అన్నారు.

అరెస్టులు అనైతికం, అక్రమం, అప్రజాస్వామికమని ఆయన అన్నారు. చర్చలకు అవి ప్రాథమిక షరతులని ఆయన చెప్పారు. ప్రభుత్వం, మావోయిస్టుల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి చర్చలకు ఉమ్మడి ఎజెండా ఖరారు చేయాలని ఆయన అన్నారు. రాజ్యం చేతిలో ఆయుధాలున్నంత వరకు తాము ఆయుధాలు వీడే ప్రసక్తి ఉండదని ఆయన చెప్పారు. సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+