సహాయానికే తొలి ప్రాధాన్యం: డిఎస్
వరదల వల్ల అపార నష్టం సంభవించినప్పటికీ ప్రాణ నష్టాన్ని నివారించడంలో అధికారులు సమర్థంగా పని చేశారని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. గుంటూరు జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సహాయక చర్యల్లో అధికారుల పని తీరు బాగుందని ఆయన ప్రశంసించారు. ప్రతిపక్షాలు విమర్శలు మాని సహాయక చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు సాయపడిన వైయస్ రాజశేఖర రెడ్డి దేశంలోనే నెంబర్ వన్ సిఎం అని ఆయన ప్రశంసించారు.
అంతకు ముందు ఆయన కర్నూలు, నంద్యాల వరద బాధితులను పరామర్శించారు. నంద్యాల నుంచి గుంటూరు జిల్లాకు బయలుదేరే ముందు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హెలిపాడ్ లో కూరుకుపోయింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హెలిపాడ్ తడిసిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని భావిస్తున్నారు.
Comments
media guntur గుంటూరు మీడియా srinivas rosaiah రోశయ్య శ్రీనివాస్ nandyala నంద్యాల కాంగ్రెసు floods వరదలు
Story first published: Monday, October 12, 2009, 18:14 [IST]