జైల్ భరో: తెరాస నేతల అరెస్టు

Telangana Leaders
హైదరాబాద్: హైదరాబాద్ ఫ్రీజోన్ కు నిరసనగా బుధవారం చేపట్టిన జైల్ భరో కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, కార్యకర్తలు పలువురు అరెస్టయ్యారు. హైదరాబాదులో తెరాస కార్యకర్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాకు దిగారు. కరీంనగర్ లో కలెక్టర్ కార్యాలయం వద్ద తెరాస జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తో పాటు 400 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఫ్రీజోన్ పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. తమ జైల్ భరో కార్యక్రమానికి అంతరాయం కలిగించేందుకే చంద్రబాబు బుధవారం కరీంనగర్ జిల్లా పర్యటనకు వచ్చారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని మరోసారి రుజువైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా వుంటే, కరీంనగర్ జిల్లాలోని ఆర్డీవో కార్యాలయంపై తెరాస కార్యకర్తలు నల్లజెండా ఎగురవేశారు. రామగుండంలో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టిన శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ ను పోలీసులు అరెస్టు చేశారు. భూపాలపల్లి సింగరేణి డిఎం కార్యాలయాన్ని మధుసూదనాచారి నేతృత్వంలో తెరాస కార్యకర్తలు ముట్టడించారు. మహబూబ్ నగర్ లో తెరాస శాసనసభ్యుడు కె. తారక రామారావుకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మెదక్ జిల్లా సిద్ధిపేట ఆర్డీవో కార్యాలయం వద్ద తెరాస జైల్ భరో కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. తెరాస కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు స్వల్బంగా లాఠీచార్జీ చేశారు శాసనసభ్యుడు హరీష్ రావు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ లోనూ తెరాస జైల్ భరో కార్యక్రమం నిర్వహించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+