వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గాలి' తిరుగుబాటుకు వైయస్ జగన్ తో లింక్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
బెంగుళూర్: కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై గాలి సోదరుల తిరుగుబాటుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో ముడిపెడుతూ ఒక తెలుగు దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద వైయస్ జగన్ ప్రతిష్టను పెంచడానికే మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి వర్గం యెడ్యూరప్పపై తిరుగుబాటుకు పూనుకున్నారనేది ఆ వార్తాకథనం సారాంశం. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డితో గాలి సోదరులకు సన్నిహిత సంబంధాలున్నాయి. వైయస్ జగన్ గాలి సోదరుల వ్యాపారాల్లో భాగస్వాములని కూడా అంటారు. తమకు అండగా ఉన్న వైయస్ రాజశేఖర రెడ్డి మరణం, ఆయన కుమారుడు వైయస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడం గాలి సోదరులను తీవ్రంగా నిరాశ పరిచినట్లు చెబుతున్నారు.

తమ బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెసు ప్రభుత్వాన్ని కర్ణాటకలో స్థాపించడం ద్వారా కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద జగన్ ప్రతిష్టను పెంచాలని గాలి సోదరులు భావిస్తున్నట్లు ఆ పత్రిక వార్తాకథనం వ్యాఖ్యానించింది. కాంగ్రెసు అధిష్టానంలోని కొందరు పెద్దల సహకారంతోనే గాలి సోదరులు యెడ్యూరప్పపై తిరుగుబాటుకు ఒడిగట్టినట్లు కూడా ఆ పత్రిక రాసింది. యెడ్యూరప్ప ప్రభుత్వాన్ని కూల్చడానికి పది మంది శాసనసభ్యులు చాలు. గాలి సోదరుల పక్కన 40 మందికిపైగా శాసనసభ్యులున్నారు. వీరంతా గాలి సోదరుల అండదండలతోనే గెలుపొందారు. వీరిలో పది మంది మంత్రులు. బిజెపి దేవెగౌడ నాయకత్వంలోని జెడి (ఎస్) సహకారం తీసుకున్నా మనుగడ సాగించడం కష్టమే. జెడి (ఎస్)కు 26 మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. కాంగ్రెసుకు 76 మంది సభ్యుల బలం ఉంది. గాలి వర్గానికి చెందిన 40 మంది మద్దతిస్తే కర్నాటకలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడం సాధ్యం. అయితే శాసనసభ స్పీకర్ ను ముఖ్యమంత్రి పదవికి గాలి సోదరులు ముందుకు తెస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X