హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి ముక్కు నేలకు రాయాలి: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తనపై, తెలంగాణ ఉద్యమంపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. రాజకీయ మనుగడ కోసం కెసిఆర్ బ్రోకరుగా మారారని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. లగడపాటి రాజగోపాల్ తన కన్నా సీనియర్ అని, అలా మాట్లాడడం సరి కాదని కెసిఆర్ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణవారు ఆంధ్రా బస్సులు ఎక్కవద్దని అంటుంటే ముఖ్యమంత్రి కె.రోశయ్య ఏం చేస్తున్నారని ఆయన అడిగారు. తనను లగడపాటి జోకర్ అంటే తన అభిమానులకు ఆవేశం రాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మొక్కు బడితే మోకాలు దెబ్బ తింటుందని ఆయన రాజగోపాల్ ను హెచ్చరించారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తమ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుల్లో 95 శాతం మంది అభిప్రాయపడ్డారని, ఈ విషయంపై సోమవారం కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. నవంబర్ లో తాను తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలిట్ బ్యూరో మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో హైదరాబాదులోని లగడపాటి రాజగోపాల్ ఆస్తుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో లగడపాటికి చెందిన ల్యాంకో హిల్స్ పై దాడి జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X