మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా

వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాను పలుసార్లు అధిష్టానం దృష్టికి తెచ్చానని, వైయస్ మరణించి రెండు నెలలైనా గానీ సిఎల్పీలో గానీ శాసనసభలో గానీ శాసనమండలిలో గానీ సంతాపం ప్రకటించలేకపోవడం మనస్తాపం కలిగించిందని, అటువంటి మహానాయకుడి మరణాన్ని జీర్ణించుకోలేక, ఆయన లేని మంత్రివర్గంలో కొనసాగలేక కొట్టుమిట్టాడుతున్నానని, దాంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె తన లేఖలో వివరించారు.
వైయస్ మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి కాకుండా కుట్ర చేశారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు కూడా జగన్ ముఖ్యమంత్రి కాకుండా కుట్ర చేశారని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. అంతా సద్దుమణిగిందని అనుకుంటున్నారని, కానీ ఆంధ్ర రాష్ట్రం అగ్ని పర్వతంలా ఉందని, అది ఎప్పుడు పేలి లావా పొంగుతుందో చెప్పలేనని ఆమె అన్నారు. ఇబ్బందులు కలిగించకూడదని జగన్, కెవిపి కోరినందుననే అల్లకల్లోలం జరగకుండా ఆగిపోయిందని ఆమె అన్నారు. జగన్ కోసం రాజీనామా చేస్తానని ప్రకటించి తర్వాత మాట మార్చానని మీడియాలో వార్తలు రావడం వల్ల తాను మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నానని ఆమె చెప్పారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇస్తే రాజీనామాను ఉపసంహరించుకుంటానని ఆమె చెప్పారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..!












Click it and Unblock the Notifications