వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనింగ్ చిక్కుల్లో గాలి జనార్దన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
న్యూఢిల్లీ: కర్నాటక బిజెపికి తలనొప్పిగా మారిన ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నివేదిక సిఫార్సులు ఆయనను ఇరకాటంలో పెడుతున్నాయి. నివేదిక సిఫార్సులు తుది నిర్ణయం కాదని, తాను మైనింగ్ ను ఆపేది లేదని ఆయన పైకి గంభీరంగా కనిపిస్తున్నారు. కానీ కష్టాలు ఆయనను వదిలేట్లు లేవు. ఆంధ్రప్రదేశ్ లోని ఓబుళాపురంలో గనుల తవ్వకాలను అపేయాలని సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ సూచించింది. సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ సిఫార్సులపై వచ్చే వారం సమీక్ష చేసి తుది నిర్ణయం తీసుకుంటారు.

అభయారణ్యంలో ఆయన పెద్ద యెత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఆయన అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నిర్ధారించింది. అది రుజువైతే ఆయనపై భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. విపరీతంగా డబ్బులు సంపాదించిన గాలి సోదరులు బళ్లారి తదితర జిల్లాలో పెద్ద యెత్తున లాబీలను ఏర్పాటు చేసుకుని కాంగ్రెసును బలహీనపరిచారు. కాంగ్రెసుకు కంచుకోట అయిన బళ్లారిలో బిజెపిని నిలబెట్టారు.

గాలి జనార్దన్ రెడ్డి అక్రమ వ్యాపారాల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు సంబంధాలున్నాయని ఇక్కడి ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. సాధికారిక కమిటీ సిఫార్సుల నేపథ్యంలో వైయస్ రాజశేఖర రెడ్ది, గాలి జనార్దన్ రెడ్డి సంబంధాలపై, అక్రమ తవ్వకాలపై, నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై రామోజీ రావుకు చెందిన ఈనాడు దినపత్రిక శనివారం పెద్ద యెత్తున వార్తాకథనాలను ప్రచురించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X