మంత్రి పొన్నాల ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

Ponnala Laxmaiah
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు శుక్రవారంనాడు వరంగల్ లోని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించారు. వారు తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవససరమైన చర్యలు చేపట్టాలని, అందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాపై ఒత్తిడి తేవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో పొన్నాలపై సొంత కాంగ్రెసు పార్టీకి చెందినవారే విమర్శలు ప్రారంభించారు.

తెలంగాణకు మద్దతుగా నిలబడినందుకే పొన్నాల లక్ష్మయ్య తనకు 2004లో టికెట్ రాకుండా చేశారని ఎమ్మెల్సీ రాజలింగం విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్య ఆంధ్రా పాలకులకు పిట్టలదొరలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెసు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కాగా, కాంగ్రెసు శాసనసభ్యుడు టి. రాజయ్య తెలంగాణకు మద్దతు ప్రకటించారు. కాకతీయ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణను బలిపశువును చేయవద్దని ఆయన కోరారు. తెలంగాణకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమించని రాజకీయ నాయకులకు రజక సంఘం, నాయీ బ్రాహ్మణ సంఘం సాంఘిక బహిష్కరణ విధించాయి. వారికి సేవలందించకూడదని ఆ సంఘాలు నిర్ణయించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+