కలత చెందే రాజీనామా చేశాను: లడగపాటి

Lagadapati Rajagopal
హైదరాబాద్: తెలుగు గడ్డ ముక్కలైపోతుందని కలత చెంది తాను పార్లమెంటు సభ్యుడిగా రాజీనామా చేసినట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. నిమ్స్ నుంచి డిశ్చార్జైన తర్వాత ఆయన మంగళవారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విశాఖ విద్యార్థులు సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో మేలుకొలుపు పలికారని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం స్వచ్ఛందంగా వచ్చిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిందని ఆయన అన్నారు. తన తెలుగు గడ్డ ముక్కలైపోతుందనే బాధతో తాను ఆమరణ నిరాహార దీక్ష చేశానని ఆయన చెప్పారు.

హైదరాబాదులోని ఫలక్ నుమా వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి విజయవాడకు తరలించడం బాధాకరమని ఆయన అన్నారు. తనను హైదరాబాద్ తరలిస్తేనే చికిత్స అంగీకరిస్తానని పట్టు బట్టినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు తాను ఎన్నేళ్లయినా బతకగలిగే దీక్షలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ సత్యం చెప్పేందుకే తాను దీక్షకు దిగినట్లు ఆయన తెలిపారు. తాను విజయవాడలో ఎప్పుడు కూడా పోలీసుల నిర్బంధంలో లేనని ఆయన అన్నారు. హైదరాబాద్ రానీయకపోవడం తన హక్కుకు భంగం కలిగించడమని భావించానని ఆయన చెప్పారు. ధర్మబద్ధం, న్యాయబద్దం కాకపోయినా తనను నిమ్స్ కు రాకుండా చేశారని, ఈ ప్రభుత్వ యంత్రాంగానికి కనువిప్పు కలిగించాలని తాను హైదరాబాద్ వచ్చానని ఆయన చెప్పారు.

తెలంగాణలోని నాలుగు జిల్లాలు తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు ఆయన తెలిపారు. పోలీసులకు, అరాచక శక్తులకు భయపడి నిమ్స్ కు రాకపోతే సామాన్యులు ఎలా వస్తారని తాను భావించి వచ్చానని ఆయన అన్నారు. పోలీసులు ఎవరు గుర్తించకపోయినా మీడియా ప్రతినిధులు ఎలా గుర్తించారో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. వెనక్కి తిరిగి చూసే సరికి తనకు నవ్వు వచ్చిందని ఆయన అన్నారు. తాను మీడియాతో మాట్లాడడానికి రాలేదని, 48 గంటలు నిమ్స్ లో ఎవరితో మాట్లాడకుండా ఉండాలని అనుకున్నానని ఆయన చెప్పారు. తన దీక్ష 19వ తేదీ సాయంత్రమే అయిపోయిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+