వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరంగల్: లగడపాటి దిష్టిబొమ్మ దగ్ధం

By Santaram
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
వరంగల్: రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఆంధ్రపాలకులు కుట్ర పన్ని లగడపాటి రాజగోపాల్‌ను నిమ్స్‌ కు పంపి తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ నాయకుడు పసునూరి దయాకర్‌ అన్నారు. లగడపాటి పోలీసుల కళ్లుకప్పి పారిపోయి వెనుక గేటు నుంచి నిమ్స్‌ ఆస్పత్రిలోకి చొరబడడాన్ని నిరసిస్తూ సోమవారం మండలకేంద్రంలోని బస్టాండ్‌ వద్ద టీఆర్‌ఎస్‌, టీడీపీ, ఎంఎస్‌ఎఫ్‌, పీఆర్పీ, కార్మిక సంఘాలు, విద్యార్థులు లగడపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా పసునూరి దయాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారని అన్నారు. తెలంగాణ ప్రక్రియలో ఏమాత్రం ఆటంకం కలిగినా జరిగే పరిణామాలకు సీఎం రోశయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. లగడపాటిని వెంటనే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గుజ్జ సంపత్‌రెడ్డి, పి.ఏకాంతం, వన్నాల శ్రీనివాస్‌, ఎండీ.అన్వర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మరపట్ల అంజయ్య, ప్రజాపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెపాక చంద్రమౌళి, కార్మిక సంఘం నాయకులు బి.ఆరోగ్యం, మునిగాల రాములు, సోమేశ్వర్‌, విద్యార్థి నాయకులు రాములు పాల్గొన్నారు.'

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X