వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎవడీ మోహన్ బాబు: జీవన్ రెడ్డి
సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజుకు ఎకరాల కొద్ది భూములను కట్టబెట్టడంపై కూడా ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రామలింగరాజు ఉద్యోగాలు తెలంగాణవారికి ఇవ్వలేదని, భూములేమో తెలంగాణవి తీసుకున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు శాంతియుతంగా పోరాటం చేయాలని ఆయన సూచించారు. అసాంఘిక శక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణపై తమ అధిష్టానం దిగిరాకుంటే కాంగ్రెసు పార్టీకి తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. విభజన కోరే ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం జరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, December 25, 2009, 11:39 [IST]