రాయలసీమ గురించి ఆలోచించండి: టిజి వెంకటేష్

తెలుగుదేశం, సిపిఐ, బిజెపి ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందున రాయలసీమ గురించి కూడా ఆ పార్టీలు ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తెర మీదికి వచ్చినప్పుడే రాయలసీమ అంశం చర్చకు వస్తుందని, అందుకు తాము సమైక్యంగా ఉండాలని భావించడమే కారణమని, అలా సాధ్యం కానిపక్షంలో రాయలసీమ వెనకబాటుతనం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పాల్సిన అవసరం ఏర్పడుతోందని ఆయన అన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, కర్నూలును దేశం రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య నినాదం తీసుకున్నందుకు ప్రజారాజ్యం పార్టీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలోని సీమాంధ్ర నేతలకు ప్రస్తుతం కొంత స్వేచ్ఛ లభించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications