వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై న్యాయ కమిటీకి మొగ్గు
తెలంగాణపై తమ డెడ్ లైన్ తమకు ఉందని, ఒత్తిళ్లకు లొంగబోమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సోమవారం చెప్పారు. ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ జెఎసి పెట్టిన గడువుపై ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి విధించిన డెడ్ లైన్ తో తమకు సంబంధం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయంతో ముందుకు పోవాలనే తమ ఆలోచనలో మార్పు లేదని కూడా ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసే అవకాశాలున్నాయని ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్న తెలంగాణ కాంగ్రెసు నాయకులు తాజాగా చెబుతున్నారు.
Comments
Story first published: Tuesday, January 26, 2010, 10:38 [IST]