సోనియాను ఇబ్బంది పెట్టొద్దు: డిఎస్

తెలుగు ప్రజల మధ్య ద్వేషాలు పెంచవద్దని కూడా ఆయన సూచించారు. కీలక సమస్యలు కూడా శాంతియుతంగానే పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. కాంగ్రెసు బలోపేతం అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుత రోశయ్య ప్రభుత్వం కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లోనే నడుస్తోందని ఆయన చెప్పారు. వైయస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా పాల్గొన్నారు. శాసనమండలి ఆవరమలో చైర్మన్ చక్రపాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications