వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై కాంగ్రెసు వాళ్లమంతా కలుద్దాం: జెసి దివాకర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ప్రాంతాలకు అతీతంగా కాంగ్రెసు నాయకులమంతా కలుద్దామని కాంగ్రెసు రాయలసీమ సీనియర్ శాసనభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సూచించారు. మంచైనా, చెడైనా తెలంగాణపై అందరం కలిసే నిర్ణయం తీసుకుందామని ఆయన అన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో భేటీ అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి పార్టీ నాయకులంతా అంగీకారానికి వచ్చినందున అందరం కలిసి ఉండడం మంచిదని ఆయన అన్నారు. తన ప్రతిపాదనను డిఎస్ ముందు పెట్టానని, డిఎస్ దానికి సరేనన్నారని ఆయన చెప్పారు.

తమ కాంగ్రెసు నాయకులంతా కలిసి ఉంటే తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణపై మంచైనా చెడైనా కాంగ్రెసు నిర్ణయం తీసుకోవాల్సిందేనని, అనుభవించాల్సింది కూడా కాంగ్రెసేనని, అందువల్ల అందరం కలిసే ఏదో ఒక నిర్ణయానికి రావడం మంచిదని ఆయన అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత తమ పార్టీ తెలంగాణ సీనియర్ సభ్యులు కె. జానా రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డిలతో చర్చిస్తానని ఆయన చెప్పారు. ఇంతకు ముందు జెసి దివాకర్ రెడ్డి ప్రాంతాలకు అతీతంగా పార్టీ శాసనసభ్యులను విందుకు ఆహ్వానించారు. అయితే తెలంగాణ శాసనసభ్యులు దాన్ని పట్టించుకోలేదు. దాంతో ఆయన ప్రయత్నం విఫలమైంది. మరోసారి ఆయన అటువంటి ప్రయత్నానికి పూనుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X