వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సలిజంపై రాష్ట్రాలకు చిదంబరం సూచనలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chidambaram
న్యూఢిల్లీ: దేశభద్రతకు నక్సలిజం పెనుముప్పుగా మారిందని కేంద్రహోంమంత్రి చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ అంతర్గత భద్రతపై ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ దేశంలోని రాష్ట్రాలు తమ బడ్జెట్లలో పోలీసుశాఖకు ఎక్కువగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పరిపాలన సరిగ్గా వుండేట్టు చూడాలని ఆయన కోరారు. జమ్మూకాశ్మీర్‌లోని పాక్‌ సరిహద్దు వెంబడి చొరబాట్లు పెరిగాయని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె రోశయ్య కూడా హాజరయ్యారు.

కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈ సమావేశం నిర్వహించిన సమయంలో మావోయిస్టుల బంద్ జరుగుతోంది. జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిస్సా రాష్ట్రాల్లో మావోయిస్టుల 72 గంటల బంద్‌ సందర్భంగా బీహార్‌లోని జముయ్‌ప్రాంతంలో రైల్వేమార్గాన్ని పేల్చివేయడంతో న్యూఢిల్లీ-హౌరా మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. నక్సల్స్‌ ఏరివేతకు ఉద్దేశించిన నాలుగురాష్ట్రాలు నిర్వహిస్తున్న సంయుక్త ఆపరేషన్లను మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X