వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ మంటలార్పే పని నాది: జస్టిస్ శ్రీకృష్ణ
''గతంలో ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఆందోళనకు గురైన కేంద్ర ప్రభుత్వం ఆ సమస్య పరిష్కార బాధ్యతలు నాకు అప్పగించింది. మద్రాస్ హైకోర్టులో న్యాయవాదుల ఘర్షణల సందర్భంగా రాజుకున్న నిప్పును ఆర్పమని నన్ను అడిగారు. ఇక తెలంగాణలో నిజంగానే మంటలు మండుతున్న సమయంలో ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను కేంద్ర హోంమంత్రి నాకు అప్పగించారు. తప్పనిసరిగా సాయపడాలని చిదంబరం స్వయంగా నన్ను కోరారు. బహుశా ఫైర్ ఫైటర్ లక్షణాలు, అర్హతలు నాలో ఉన్నాయనుకుంటున్నాను. సమస్యల పరిష్కారానికి ఇవన్నీ ఉపయోగపడగలవని ఆశిస్తున్నాను'' అని జస్టిస్ శ్రీకృష్ణ అన్నారు. స్మారకోపన్యాసంలో చేసిన ఈ వ్యాఖ్యలు మినహా తెలంగాణ అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలను ఆయన సున్నితంగా తిరస్కరించారు.
Comments
Story first published: Sunday, February 7, 2010, 11:30 [IST]