వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాకు వస్తున్న అపాచీ షూ కంపెనీ

By Santaram
|
Google Oneindia TeluguNews

Guntur Dist
గుంటూరు: జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ షూ కంపెనీ 'అపాచి' సమాలోచనలు చేస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే కోస్తాలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. కంపెనీ విస్తరణలో భాగంగా పారిశ్రామికంగా వృద్ధి చెందుతున్న గుంటూరులో కూడా తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కంపెనీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని పరిశీలించేందుకు అపాచి జనరల్‌ మేనేజర్‌ ఆండ్రూచెన్‌ మంగళవారం కలెక్టర్‌ రామాంజనేయులను కలిసేందుకు వచ్చారు. గుంటూరు సమీపంలోని పొత్తూరులో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్‌, జిల్లా అధికారులతో కలిసి చెన్‌ పరిశీలించారు. అనంతరం రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్వగృహంలో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపడతామని కంపెనీ ప్రతినిధి చెన్‌కు హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. పొత్తూరు సమీపంలోని పరిస్థితులను కంపెనీ ప్రతినిధికి కలెక్టర్‌ కూలంకషంగా వివరించారు. కంపెనీ స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందన్నారు. ఆండ్రూ చెన్‌ మాట్లాడుతూ 15 రోజుల్లో మరోసారి గుంటూరుకు రానున్నట్లు తెలిపారు. ఆ సమయానికి తగిన ప్రణాళికలను రూపొందించి ఇవ్వాలని కోరారు. కంపెనీ స్థాపనకు 20 నుంచి 25 ఎకరాల భూమి అవసరం అవుతుందని, కంపెనీ ఏర్పాటుకు వనరులు సమకూర్చాలని చెన్‌ కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X