గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడ-గుంటూరు మధ్య అనేక రైళ్ళు రద్దు

By Santaram
|
Google Oneindia TeluguNews

Prakasam Barrage
విజయవాడ: విజయవాడ-కృష్ణకెనాల్‌ జంక్షన్‌ మధ్య బ్రిడ్జి మరమ్మతులు జరుపుతున్న కారణంగా గుంటూరు-విజయవాడ నగరాల మధ్య తిరిగే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. చెన్నై-విజయవాడ మధ్య నడిచే జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-తెనాలి మధ్య, 2705/06 సికింద్రాబాద్‌-గుంటూరు నడుమ నడిచే ఇంటర్‌సిటీఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ-గుంటూరుల మధ్య రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా విజయవాడ - హుబ్లీ పాసింజర్‌, 433/434 విజయవాడ - యశ్వంత్‌ ఫూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ను విజయవాడ - గుంటూరుల మధ్య నిలిపివేస్తున్నారు. గూడూరు - విజయవాడ మధ్య నడిచే బిట్రగుంట పాసింజర్‌ను, నర్సరావుపేట - విజయవాడ పాసింజర్‌ ను పాక్షికంగా రద్దు చేస్తున్నామని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X