వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల హత్య కేసులో సిబిఐ మెలిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Ravi
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో సిబిఐ మెలిక పెట్టింది. విచారణ తుది దశలో ఉన్న సమయంలో కోర్టులో సిబిఐ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురిని విచారించాల్సి ఉందంటూ సిబిఐ ఆ పిటిషన్ దాఖలు చేసింది. పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెల చెర్వు సూర్యనారాయణ అలియాస్ సూరి భార్య గంగుల భానుమతిని, తల్లి అమ్మాయమ్మను, మరొరిని విచారించాల్సి ఉందని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.

పరిటాల రవి హత్య కేసులో సిబిఐ 130 మందిని విచారించింది. ఈ కేసులో నిందితుడు జూలకంటి రంగారెడ్డి అలియాస్ మొద్దు శీను జైలులో హత్యకు గురయ్యాతడు. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన హత్యకు గురయ్యారు. ఈ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. తనపై తీవ్ర ఆరోపణలు రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పరిటాల రవి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X