హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భౌతిక దాడులు అమానుషం: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రశ్నించినంత మాత్రాన భౌతిక దాడులు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. భౌతిక దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన అన్నారు.

కాగా, చంద్రబాబుపై తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో ముగ్గురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రశేఖర్, జ్యోతికిరణ్, మరో న్యాయవాది గాయపడ్డారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఇందిరా పార్కు ఆవలి వైపు ఉన్న న్యాయవాదులపై కార్యకర్తలు దాడి చేశారు. తాళం పగులగొట్టి న్యాయవాదుల వైపు దూసుకెళ్లి టిడిపి కార్యకర్తలు దాడి చేశారు.

చంద్రబాబుపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ న్యాయవాదులు అంటున్నారు. గాయాలకు తామే చికిత్స చేయించుకుంటామని వారు చెప్పారు. దీంతో ప్రతిపక్షాల మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదులపై దాడిని చంద్రబాబు కుట్రగా తెలంగాణ వాగ్గేయకారుడు గద్దర్ విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X