భౌతిక దాడులు అమానుషం: కెసిఆర్
కాగా, చంద్రబాబుపై తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో ముగ్గురు న్యాయవాదులు తీవ్రంగా గాయపడ్డారు. చంద్రశేఖర్, జ్యోతికిరణ్, మరో న్యాయవాది గాయపడ్డారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెలంగాణపై వైఖరి చెప్పాలని డిమాండ్ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఇందిరా పార్కు ఆవలి వైపు ఉన్న న్యాయవాదులపై కార్యకర్తలు దాడి చేశారు. తాళం పగులగొట్టి న్యాయవాదుల వైపు దూసుకెళ్లి టిడిపి కార్యకర్తలు దాడి చేశారు.
చంద్రబాబుపై తాము న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ న్యాయవాదులు అంటున్నారు. గాయాలకు తామే చికిత్స చేయించుకుంటామని వారు చెప్పారు. దీంతో ప్రతిపక్షాల మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయవాదులపై దాడిని చంద్రబాబు కుట్రగా తెలంగాణ వాగ్గేయకారుడు గద్దర్ విమర్శించారు.
Comments
Story first published: Saturday, March 6, 2010, 14:33 [IST]