బాబు, రోశయ్య కుమ్మక్కయ్యారా?

కాగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కడప కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కూడా రోశయ్యతో రాజీకి వచ్చినట్లు చెబుతున్నారు. రోశయ్యకు సహకరించడం ద్వారా తన పార్టీ అధిష్టానం పట్ల తన విధేయతను చాటుకోవాలనేది ఆయన ఉద్దేశమని చెబుతున్నారు. ఇప్పుడు ఎలాగూ ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశాలు లేవు కాబట్టి రోశయ్యకు సహకరించడం ద్వారా భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఆయన లక్ష్యంగా చెబుతున్నారు. రోశయ్యపై తీవ్ర విమర్శలు చేసిన తెలుగుదేశం నాయకులపై జగన్ కు చెందిన పది మంది కడప శాసనసభ్యులు కొట్టిపారేస్తూ తీవ్రంగా మాట్లాడడం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
మొత్తం మీద, అన్ని విధాలుగా, అన్ని వైపుల నుంచి రోశయ్యకు సహకారం అందుతోందని అభిప్రాయం ఉంది. దీంతో ఆయన తన స్థానాన్ని పటిష్టపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థితిలో ఏప్రిల్ మొదటివారంలో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ కూడా చేపట్టే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications