వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్ర ప్రణాళిక రూ. 36, 800 కోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: 2010 - 11 సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రూ. 36,800 కోట్లకు రాష్ట్ర ప్రణాళినకు కేంద్ర ప్రణాళిక సంఘం ఆమోదించింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాను కలిసి వార్షిక ప్రణాళికకు ఆమోద ముద్ర వేయించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని ప్రణాళికా సంఘం అభిప్రాయపడింది. సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయాలని రాష్టానికి సూచించినట్లు అహ్లూవాలియా రోశయ్యతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఆమోదించినందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రణాళికా సంఘానికి కృతజ్ఝతలు తెలిపారు. నిధుల సేకరణ, వినియోగంపై ప్రణాళికా సంఘం కొన్ని సూచనలు చేసిందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ముసాయిదాలో కోరినట్లు ఆయన తెలిపారు. అహ్లూవాలియాతో భేటీ అనంతరం రోశయ్య కేంద్ర మంత్రి కమల్నాథ్ ను కలిశారు. రాష్ట్రంలోని రహదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచిస్తానని కమలనాథ్ రోశయ్యకు హామీ ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X