హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై బాబు స్పష్టత ఏమిటి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తమకు స్పష్టమైన వైఖరి ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. కానీ ఆ స్పష్టత ఏమిటో చెప్పరు. వైఖరి స్పష్టంగా ఉన్నప్పుడు పార్టీ నాయకులు రెండుగా చీలిపోయి ఒక వైపు తెలంగాణవాదాన్ని, మరోవైపు సమైక్యవాదాన్ని ఒకే సమయంలో ఎందుకు వినిపిస్తారో, వారిని చంద్రబాబు ఎందుకు కట్టడి చేయరో అర్థం కావడం లేదని అంటున్నారు. పార్టీ నాయకులపై చంద్రబాబుకు అదుపు లేదని భావించాల్సి ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉన్నామని చంద్రబాబు చెబుతున్నారంటే గత నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని అనుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కమిటీ వేసి సుదీర్ఘంగా చర్చించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకైతే పార్టీ వైఖరి అదే. పార్టీ తెలంగాణ అనుకూల వైఖరికి కట్టుబడి ఉందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు ఆ మధ్య కాలంలో చెప్పారు. అయితే తాను మాత్రం వ్యక్తిగతంగా వ్యతిరేకమని చెప్పారు.

సీమాంధ్ర వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీ వైఖరిని అధిగమించి ఎందుకు వ్యక్తమవుతున్నాయనేది, దాన్ని చంద్రబాబు ఎందుకు అనుమతిస్తున్నారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. పార్టీ వైఖరి స్పష్టంగా ఉన్నప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి పార్టీ తరఫున ఒకే నివేదికను ఎందుకు సమర్పించలేదనేది మరో ప్రశ్న. ఇటు తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, అటు సీమాంధ్ర నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని శ్రీకృష్ణ కమిటీకి నివేదికలు సమర్పించారు. దీన్ని పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. అంటే, సీమాంధ్ర నాయకులను కట్టడి చేసే స్థితిలో ఆయన లేరని భావించాల్సి ఉంటుంది. లేదంటే, తెలంగాణకు అనుకూలమంటూనే సమైక్యవాదాన్ని బలపరిచేందుకు ఆయన సిద్ధపడి ఉండాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X