హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆత్మకూరు మాజీ శాసనసభ్యుడు సీతారాం రెడ్డి మృతి చెందారు. హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని 212 గదిలో మూడు రోజుల క్రితం మరణించారు. అయితే ఆ విషయం శుక్రవారం బయటపడింది. 212 గదిలోని సోఫాలో ఆయన మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు.
రెండు రోజులుగా సీతారాంరెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆయన బంధువులు చెప్పారు. తొలుత ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే గుండెపోటుతోనే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.