మా తెలంగాణ వైఖరి స్పష్టం: చంద్రబాబు

రాష్ట్రాన్ని కాంగ్రెసు భ్రష్టు పట్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ధరల పెరుగుదలపై అన్ని పార్టీలతో కలిసి తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ధరల పెరుగుదలపై ప్రజలను చైతన్యం తెచ్చి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ప్రచారం సాగిస్తామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రతిపక్షాలు చేపట్టిన హర్తాళ్ ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు. ప్రభుత్వం మధ్య దళారులను పెంచి పోషిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు.












Click it and Unblock the Notifications