వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్లూవాలియాతో రోశయ్య సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాతో ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక రూపకల్పనపై ఆయన అహ్లూవాలియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న రోశయ్య కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కేంద్ర మంత్రి, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీని కలుసుకున్నారు. కాంగ్రెసు రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ తో కూడా ఆయన సమావేశమయ్యారు. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ అధిష్టానం నుంచి ఆమోదం పొందేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఆయన ఉపరితల రవాణా శాఖ మంత్రి కమల్నాథ్ తో కూడా రోశయ్య సమావేశమవుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X