విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మామను, బావమరిదిని హత్య చేసిన వ్యక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna Dist
విజయవాడ: ఓ కిరాతకుడు కృష్ణా జిల్లాలో మామను, బావ మరిదిని నరికి చంపాడు. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ దారుణమైన సంఘటన జరిగింది. మణిరాజు అనే వ్యక్తి తన భార్యను కాపురానికి పంపడం లేదని వారిద్దరిని హత్య చేశాడు. ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ల ఎదుటే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పైగా అతను పారిపోయాడు కూడా. ఈ సంఘటన కృష్ణా జిల్లాలోని కలిదిండి మండలం సంతోషపురంలో చోటు చేసుకుంది.

మణిరాజు నుంచి తమకు ముప్పు ఉందని అతని మామ, బావ మరిది అప్పటికే కలిదిండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలిదిండి నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు రక్షణ కోసం వచ్చారు. అయితే వారు ఉన్నా, లేకున్నా ఒక్కటే అయింది. మణిరాజు మామను, బావమరిదిని హత్య చేసి ఉడాయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X