వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ తో కుప్పకూలిన కసబ్

By Santaram
|
Google Oneindia TeluguNews

Ajmal Kasab
ముంబై: ముంబై దాడుల కేసులో ప్రధాన నిందితుడు కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించగానే కసబ్‌ దిగ్బ్రాంతితో కుప్పకూలాడు. అప్పటివరకు నేలవంక చూస్తూ కూర్చున్న అతనుతీర్పు వినగానే భోరున ఏడ్చాడు. తీర్పుపై ఏమైనా చెప్పేది ఉందా అని జడ్జి అడిగినా ఏం మాట్లాడలేకపోయాడు. దాంతో అతన్ని బయటకు తీసుకెళ్లి మంచినీళ్లు ఇవ్వమని జడ్జి ఆదేశించారు.

కరడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది, 26/11 ముంబై దాడుల దోషి అజ్మల్‌ అమీర్‌ కసబ్‌కు మరణశిక్ష విధిస్తూ ఇక్కడి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉజ్వల్‌ నికమ్‌ స్వాగతించారు. ఈ శిక్ష ద్వారా ముంబై దాడుల బాధితులకు ఊరట కలుగుతుందని ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించిన ఆయన తెలిపారు. కసబ్‌ ముసలి కన్నీరు కారుస్తున్నాడని, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించడాని తెలిపారు. పాముకు ఎంతగా పాలు పోసి సాకినా, అది విషమే కక్కుతోందని, అలాగే దుర్జనుడిగా సాయం చేసినా తన నైజాన్ని మరవక పాత విధానమే అవలంబిస్తాడని ఈ సందర్భంగా ఓ ఆర్యోక్తిని ప్రస్తావించారు. కసబ్‌కు ఉరిశిక్ష పడడం దేశ ప్రజలందరి విజయమని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X