జగన్ కు కళ్లెం: రోశయ్యకు భరోసా

Sonia Gandhi
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. రోశయ్యకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పూర్తి భరోసా ఇచ్చారు. మెత్తగా ఉండదని, కఠినంగా వ్యవహరించాలని ఆమె సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేస్తున్న వ్యవహారాన్ని సోనియా గాంధీ సీరియస్ గా తీసుకుని, రోశయ్యకు పూర్తి సహకారం అందించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో రోశయ్య స్వరం పెంచి జగన్ పేరు ప్రస్తావించకుండా ఆయన వర్గీయులపై ఘాటైన వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. గీత దాటితే వేటు తప్పదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఘాటైన వ్యాఖ్య చేశారు.

అవసరమైతే సోనియాను కూడా నిలదీస్తామని జగన్ వర్గానికి చెందిన గుర్నాథ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యను పార్టీ అదిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆ వ్యాఖ్యలు చేసిన నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి సిద్ధపడింది. ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఆ తర్వాత స్వరం పెంచి పార్టీలోని ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. కఠినంగా వ్యవహరించాలని, మీ వెంట మేముంటామని అధిష్టానం ఇచ్చిన హామీతో ఆయన కటువుగా మాట్లాడినట్లు తెలుస్తోంది.

జగన్ కు వ్యతిరేకంగా పార్టీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని భావించడంతో వైయస్ అనుంగు మిత్రుడు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు వీరప్ప మొయిలీని కలిశారు. సంక్షేమ పథకాలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+