వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మావోయిస్టుల డంప్ లో 4 కోట్ల బంగారం లభ్యం?

By Santaram
|
Google Oneindia TeluguNews

Warangal Map
వరంగల్: వరంగల్ జిల్లాలో మావోయిస్టులకు చెందిన నాలుగు కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు దొరికాయన్న విషయం సంచలనం సృష్టించింది. పినపాక మండలంలోని సమత్‌మోతె పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గిరిజన రైతుకు మావోయిస్టులకు చెందిన డంప్‌లో భారీస్థాయిలో బంగారం బిస్కెట్లు లభించిన విషయం సంచలనం రేపింది. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి సమీపంలోని దైతగుట్టల వద్ద దట్టమైన అడవిలో ఈ డంప్‌ దొరికిందని ప్రచారం జరుగుతోంది. సంబంధిత వ్యక్తి బంగారం బిస్కెట్‌ తూకం తెలుసుకోవడం కోసం గ్రామంలోని ఓ కిరాణా దుకాణం వద్ద కాంటా వేయించడంతో ఈ విషయం బయటకు పొక్కినట్లుగా సమీప గ్రామాల ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

ఈ డంప్‌లో ఓ స్టీల్‌ పెట్టెలో భద్రపరిచిన 30 బంగారం బిస్కెట్లు దొరికాయంటున్నారు. వీటి విలువ సుమారు రూ.4కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. వీటితో పాటు డంప్‌ వివరాలతో కూడిన ఓ పుస్తకం కూడా లభించినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కడంతో సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై కరకగూడెం ఎస్సై రమేశ్‌ను వివరణ కోరగా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని డంప్‌ సమాచారం తమ దృష్టికి రాలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X