హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికార దాహంతోనే జగన్ బోగస్ యాత్ర: మధు యాష్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ గౌడ్ బోగస్ గా అభివర్ణించారు. అధికార దాహంతోనే జగన్ ఓదార్పు యాత్రను చేపట్టారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ పై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు పూర్తి మద్దతు ప్రకటించారు. జగన్ అనుచరుల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

కె. రోశయ్య తనంత తానుగా ముఖ్యమంత్రి పదవిని కోరుకోలేదని, అధిష్టానం ఆదేశాల మేరకే రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టారని ఆయన చెప్పారు. ప్రస్తుతం రోశయ్య సమర్థంగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై అనుచిత వ్యాఖ్యలు సరి కాదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి క్షమాగుణం ఎక్కువని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X