ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి, మహారాష్ట్ర సరిహద్దులో చంద్రబాబు సహా టిడిపి నేతల ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఆదిలాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారంనాడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దులో ధర్నాకు దిగారు. ధర్మాబాద్ కు సమీపంలోని సరిహద్దులో చంద్రబాబు ధర్నాకు దిగారు. చంద్రబాబు నేతృత్వంలోని నాయకులను మహారాష్ట్ర బలగాలు సరిహద్దులు దాటనీయడం లేదు. సరిహద్దు ప్రాంతంలో అనుకూల, వ్యతిరేక నినాదాలు మిన్నంటుతున్నాయి. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

బాబ్లీ విషయంలో తమకు ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే తప్ప తాము కదిలేది లేదని తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమావేశపరిచి సమస్యను పరిష్కరిస్తామని ప్రధాని నుంచి హామీ రావాలని ఆయన అన్నారు. నిపుణుల కమిటీ వేయించి బాబ్లీ, ఇతర అక్రమ ప్రాజెక్టుల వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాబ్లీని అడ్డుకోకపోతే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని చంద్రబాబు అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని, ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘిస్తోందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X