విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కృష్ణానదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Krishna River
విజయవాడ‌: విజయవాడలో కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను విజయవాడలోని జైకిసాన్ పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. వారిని పదో తరగతి చదువుతున్న దేవీ వరప్రసాద్, రవితేజలుగా గుర్తించారు. ఆదివారం సాయంత్రం ఐదుగురు విద్యార్థులు కృష్ణా నది ఒడ్డున క్రికెట్ ఆడి ఆ తర్వాత స్నానం కోసం కృష్ణా నదిలోకి వెళ్లారు.

కృష్ణా నదిలో విద్యార్థులు కొట్టుకుపోయారు. అయితే ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా ఇద్దరు మరణించారు. బయట పడిన విద్యార్థులు మిగతా విద్యార్థుల సమాచారం ఎవరికీ చెప్పలేదు. దీంతో ఇద్దరు విద్యార్థులు కృష్ణానదిలో మునిగిపోయిన విషయం ఆలస్యంగా తెలిసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X