చంద్రబాబు నాయుడు బాబ్లీ పోరు: రాష్ట్రంలో ప్రాణత్యాగాల పర్వం

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తను విని తట్టుకోలేక సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో రాజయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయటాన్నిచూసి తట్టుకోలేని ముగ్గురు పార్టీ అభిమానులు ఆదివారం ప్రాణత్యాగానికి పాల్పడ్డారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ మరణాలు సంభవించాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వ్యవసాయకూలీ జొన్నకూటి విల్సన్‌రాజు(35) శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబును మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయటంతో విల్సన్‌రాజు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబీకులు తెలిపారు. చంద్రబాబు సూచన మేరకు రూ.2 లక్షలను బాధిత కుటుంబానికి సాయంగా అందిస్తున్నట్లు జిల్లా టిడిపి అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ప్రకటించారు.

చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా మైలవరంలో టిడిపి కార్యకర్త దునకా జమలయ్య(42) ఆదివారం ఉదయం మృతి చెందాడు. చంద్రబాబును అరెస్టు చేసిన వార్త విని గుంటూరు జిల్లా కురగల్లులో టిడిపి కార్యకర్త కుర్రా శ్రీనివాసరావు(44) ఆదివారం మరణించాడు. పార్టీ కార్యకర్తల ఆత్మహత్యలపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి ప్రకటించారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం, బాబ్లీ ప్రాజెక్టు అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తెదేపా అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు. శాంతియుతంగా ఆందోళన తెలపాలని, ఎటువంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడవద్దని శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+