బాబ్లీపై నిరసన: తెలుగుదేశం పార్టీ బంద్ తో స్తంభన

APSRTC
హైదరాబాద్‌: మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బంద్ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్త హర్తాళ్‌కు వామపక్షాలు తమ సంఘీభావం ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బస్సు డిపోల వద్ద బైఠాయించి బస్సులను కదలకుండా ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. బంద్‌ కారణంగా హైదారాబాదులోని దిల్‌సుఖ్ ‌నగర్‌, హయత్‌ నగర్ ‌లో బస్సులను తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 750 బస్సులు నిలిచిపోయాయి. గుంటూరులో తెదేపా కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. ఒంగోలులో బంద్‌ నిర్వహిస్తున్న తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లావ్యాప్తంగా 7 డిపోల్లో 600కు పైగా బస్సులు నిలిచిపోయాయి.

ఒంగోలు-కర్నూలు రహదారిపై తెదేపా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో తెదేపా రాస్తారోకో చేపట్టింది. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై తెదేపా, సీపీఎం రాస్తారోకో చేపట్టాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. వరంగల్‌లోని పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. కరీంనగర్‌, హన్మకొండ డిపోల్లో బస్సులు కదలకుండా తెదేపా నేతలు బైఠాయించారు. కడపలో వాహనాల టైర్లలో గాలి తీసి రాకపోకలను అడ్డుకుంటున్నారు. మంగళగిరిలో బస్సులను అడ్డుకున్న తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్‌ కారణంగా ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దులోని బిద్రెల్లి వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆదిలాబాద్‌, భైంసా, నిర్మల్‌ డిపోల పరిధిలో బస్సులు నిలిచిపోయాయి. ఇదిలాఉండగా ఎంజీబీఎస్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+