ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిస్థితి చూస్తుంటే చనిపోవాలనిపిస్తోంది: హరికృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
ఆదిలాబాద్: కాంగ్రెసు నాయకులు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పరామర్శించేందుకు బయలుదేరిన హరికృష్ణకు మహారాష్ట్ర పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద ఆయనను అడ్డుకున్నారు. తీవ్ర వాగ్యుద్ధం తర్వాత పోలీసులు ఆయనను వదిలేశారు. అయితే కొద్దిసేపటికే యెంచి వద్ద హరికృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. మన రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించి మహారాష్ట్ర పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. పరిస్థితి చూస్తుంటే చనిపోవాలని అనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్రంలో, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు ప్రభుత్వమే ఉందని, బాబ్లీని చూడనీయకుండా కాంగ్రెసు అడ్డుకుంటోందని ఆయన అన్నారు. మహారాష్ట్రవారు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారని, ఇది సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X