వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ పై నివేదిక తెప్పిస్తున్నాం: వీర్ప మొయిలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంపై నివేదిక తెప్పిస్తున్నామని, నివేదిక అందిన తర్వాతనే ఏమైనా స్పందిస్తామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై, ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలపై నివేదిక తెప్పిస్తున్నామని, ఆ అంతర్గత నివేదిక అందిన తర్వాతనే మాట్లాడుతామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సోనియాకు, రోశయ్యకు వ్యతిరేకంగా జగన్ వ్యాఖ్యలు చేసి ఉంటే అది మంచిది కాదని ఆయన అన్నారు.

పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు సస్పెన్షన్ పద్ధతి ప్రకారమే జరిగిందని ఆయన అన్నారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన తర్వాతనే రాంబాబును సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానమే అంబటి రాంబాబును సస్పెండ్ చేయాలనే నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పార. అంబటి రాంబాబు జగన్ మద్దతుదారుడో, కాదో తమకు తెలియదని ఆయన అన్నారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అంబటిని సస్పెండ్ చేశాంమని ఆయన చెప్పారు. బాబ్లీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటంపై తానేమీ మాట్లాడబోనని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X