మహారాష్ట్ర నుంచి తిరిగి వస్తామనుకోలేదు: చంద్రబాబు నాయుడు
మహారాష్ట్ర ప్రభుత్వం తను ప్రజాప్రతినిధులుగా చూడలేని, రాజకీయ ఖైదీలుగా చూస్తోందని ఆయన విమర్శించారు. మహారాష్ట్రకు వెళ్లడానికి వీసాలు, పాస్ పోర్టులు కావాలా అని ఆయన అడిగారు. దేశంలోని ఎక్కడైనా తిరిగే హక్కు తమకు ఉందని మెజిస్ట్రేట్ కు చెప్పామని ఆయన చెప్పారు. తమపై పెట్టిన కేసులు చెల్లవని, బెయిల్ తీసుకునే ప్రసక్తి లేదని చెప్పామని ఆయన అన్నారు. గత ఐదేళ్లుగా తాము బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఎడారి అవుతుందని ఆయన అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బాబ్లీని కట్టడానికి మహారాష్ట్ర సాహసం చేయలేదని ఆయన అన్నారు.
Comments
శాసనసభ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం బాబ్లీ మహారాష్ట్ర హైదరాబాద్ assembly chandrababu naidu telugudesam babli maharashtra hyderabad
Story first published: Wednesday, July 21, 2010, 12:57 [IST]