హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్ ర్యాంకులు విడుదల: టాపర్స్ వీరే

By Pratap
|
Google Oneindia TeluguNews

EAMCET Ranks
హైదరాబాద్: ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో ర్యాంకులను సాంకేతిక విద్యా మంత్రి మోపిదేవి వెంకట రమణ బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. రెండు విభాగాల్లో టాప్ ఐదు ర్యాంకర్ల పేర్లను ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఇంజినీరింగ్ పరీక్షకు 3, 16,084 మంది పరీక్ష రాయగా, 2,80,395 మంది ఆర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. మెడికల్ విభాగంలో 51,185 మంది పరీక్ష రాయగా, 45,962 మంది అర్హత సాధించినట్లు ఆయన చెప్పారు. ఆగస్టు మూడో వారం నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని ఆనయ చెప్పారు.

ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ విశాఖపట్నానికి చెందిన ఎండి గౌస్ జానీ సాధించగా, రెండు నుంచి ఐదు ర్యాంకులు వరుసగా ఎ జనార్దన్ రెడ్డి (గుంటూరు), పల్లవి (విజయవాడ), సాయి కిరణ్ (కాకినాడ), లక్ష్మీపతి (చిత్తూరు) సాధించారు. మెడికల్ విభాగంలో ఫస్ట్ ర్యాంకును హైదరాబాదుకు చెందిన రావినూతల లలిత సాధించింది. రెండు నుంచి ఐదు ర్యాంకులను వరుసగా కిరణ్మయి (విజయవాడ), రాహుల్ (హైదరాబాద్), లక్ష్మి (విజయవాడ), మాధురి (హైదరాబాద్) సాధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X