హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబ్లీపై పిఎం హామీ ఇస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటాం: ఎర్రబెల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: బాబ్లీ సమస్యను పరిష్కరిస్తామని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇస్తే తమ పార్టీ తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. బాబ్లీ విషయంలో తాము రాజకీయం చేస్తున్నామని అనడం సరి కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమను మహారాష్ట్ర పోలీసులు కొట్టినందుకు బాధ లేదని, సమస్య పరిష్కారం కానందుకు బాధగా ఉందని ఆయన అన్నారు.

బాబ్లీపై తమ పార్టీ పోరులో రాజకీయం లేదని మరో తెలుగుదేశం నేత తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అసమర్థత వల్లనే బాబ్లీ సమస్య తలెత్తిందని మరో తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి వరంగల్ లో అన్నారు. రోశయ్యపై, భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోశయ్య చేతగాని చవట అని, దద్దమ్మ అని ఆయన అన్నారు. ధర్మాబాద్ లో తమ పార్టీ నేత చంద్రబాబుపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X