మోహన్ బాబుతో చిరంజీవికి విభేదాలు లేవట

చలనచిత్ర వజ్రోత్సవాల సందర్భంగా తమ మధ్య విభేదాలు పొడచూపిన మాట వాస్తవమేనని, అయితే తదనంతరం అవి సమసిపోయాయని చెప్పారు. ప్రస్తుతం తమ కుటుంబాలు రాకపోకలు సవ్యంగానే సాగిస్తున్నాయని, విభేదాలకు ఆస్కారంలేదని అంటూ తాను విద్యానికేతన్కు వెళ్ళడాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరంలేదని ఆయన అన్నారు. ఈ నెల 26న అఖిలపక్షం ప్రధానమంత్రిని కలిసేందుకు వెళుతుందని, బాబ్లీ విషయంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగానే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తెలంగాణా జిల్లాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉపేక్షించబోమని, రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలన్నీ బాబ్లీ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత వుందని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications